(జై భారత్ వాయిస్ దామెర )
దామెర మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో రక్షాబంధన్ (రాఖీ) వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో గురువారం దామెర మండలంలోని వివిధ గ్రామాల్లో ఉదయమే రాఖీ సందడి కనిపించింది. ఈ క్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు వారి వారి ఇళ్లల్లో రక్షాబంధన్ హడావిడి మొదలైంది. అన్నా తమ్ముళ్లకు అక్కా చెల్లెల్లు వివిధ రకాలైన రాఖీలు కట్టి తమ సోదరీ, సోదర భావాన్ని చాటుకున్నారు. తమకు తోచిన రీతిలో వారికి బహుమతులు అందించారు. అంతే కాకుండా సాంప్రదాయ పద్ధతిలో నూతన వస్త్రాలను అందించారు. ఆ తరువాత స్వీట్లు పంచుకుని రక్షాబంధన్ ఒకరినొకరు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా దామెర మండలం ల్యాదెల్లలో ఎంపీపీ కాగితాల శంకర్, దుర్గంపేటలో ఎంపీటీసీల ఫోరం జిల్లా చైర్మన్, బీఆర్ఎస్ దామెర మండల అధ్యక్షుడు గండు రామకృష్ణ, కోగిల్వాయిలో సర్పంచ్ల ఫోరం చైర్మన్ గట్ల విష్ణువర్ధన్రెడ్డి, ఒగ్లాపూర్లో గ్రామాభివృద్ధి చైర్మన్ కేతిపెల్లి శ్రీధర్రెడ్డి, ముస్త్యాలపల్లిలో సర్పంచ్ వడ్డపల్లి శ్రీనివాస్, దుర్గంపేటలో సర్పంచ్ల ఫోరం ప్రధాన కార్యదర్శి పురాణం రాజేశ్వరి ఈశ్వర్, ఊరుగొండలో గోగుల సత్యనారాయణరెడ్డి, పులుకుర్తిలో గోవిందు అశోక్, వెంకటాపూర్లో పున్నం రజితసంపత్ తదితరులు రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు.

previous post
next post