(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్)
గ్రేటర్ వరంగల్ కరీమాబాద్ తోట్లవాడ హనుమాన్ విగ్రహం శ్రీ అభయాంజనేయ స్వామి రెండవ వార్షికోత్సవం* సందర్భంగా కమిటీ సభ్యులు స్థానిక భక్తులు. ఆంజనేయ స్వామికి అభిషేకం చేసి వివిధ రకాల పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రామదూత హనుమాన్ చాలీసా 11 సార్లు సంపూర్ణ పారాయణం భక్తి పాటలు భజనలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమల్ శర్మ సాయి శర్మ ,కమిటీ సభ్యులు చల్ల వెంకన్న,బైరి వంశీ,అట్ల సాంబయ్య,గోంగూల ఐలయ్య,మేడిది మధుసూదన్,దరిగెల విజయ్ ఆకుతోట.బాలకొమురెల్లి,పేరాల ప్రభాకర్,మాటేటి సత్యనారాయణ(సత్యం),వీరమల్ల క్రాంతి కుమార్, బస్వరాజు హరీష్,భెడిద శ్రీనివాస్,కనుకుంట్ల కిరణ్, ఆకుతోట మోహన్ కృష్ణ, రేగుల రాకేష్ స్వామి, గుగ్గుల సాయిరిష్,ఆసం సాయి ప్రణీత్,అంజి తదితర స్థానిక భక్తులు హాజరై స్వామి హన్ మాన్ చాలీసా నామస్మరణతో మారుమోగింది.ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

