(జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని shubhaleka sudhakar సినీ నటుడు శుభలేఖ సుధాకర్ మర్యాద పూర్వకంగా కలిశారు. డిసెంబర్ 15 న రవీంద్రభారతి ఆవరణలో ప్రముఖ గాయకుడు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణకు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.రవీంద్రభారతి ఆవరణలో విగ్రహ ఏర్పాటు కోసం అనుమతించినందుకు ఈ సందర్భంగా శుభలేఖ సుధాకర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబం తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు.

