(Jaibharathvoice news Hanamakonda) గ్రేటర్ వరంగల్ నగరంలోని హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పౌర సంబంధాల అధికారిగా (పి ఆర్ ఓ) జర్నలిజం విభాగానికి చెందిన అధ్యాపకుడు డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డినీ తిరిగి నియమిస్తూ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి సోమవారం తన ఛాంబర్లో అధికారిక ఉత్తర్వుల నియామక పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జ్యోతి మాట్లాడుతూ, ఆదిరెడ్డి 2002 నుండి రెండు దఫాలుగా 23 సంవత్సరాలు పౌర సంబంధాల అధికారిగా కళాశాల ప్రతిష్టను విశ్వవిద్యాలయ పరిధిలోనూ, సామాజిక వర్గాల్లోనూ సమర్థంగా విస్తరించారు. విద్యా రంగ పురోగతిని, విద్యార్థుల సాధనలను, విభాగాల కార్యాచరణను ప్రజలకు చేరవేయడంలో ఆయన పాత్ర అపారము. కళాశాల అభివృద్ధి దిశలో ఆయన అనుభవం ఎంతో మేలు చేస్తుందన్న నమ్మకంతో మరోసారి పిఆర్ఓ బాధ్యతలు అప్పగిస్తున్నాము” అని పేర్కొన్నారు.ఉత్తర్వులు అందుకున్న అనంతరం డాక్టర్ ఆదిరెడ్డిని కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రెహమాన్, డాక్టర్ జితేందర్, హరికుమార్, అధ్యాపకులు తదితరులు అభినందించారు.ఈసందర్బంగా డాక్టర్ ఆదిరెడ్డి మాట్లాడుతూ,కళాశాల విద్యా–సాంస్కృతిక పురోగతిని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పిఆర్ఓగా బాధ్యతాయుతంగా పని చేస్తాను. అకాడమిక్, పరిశోధనా, విద్యార్థి అభివృద్ధి కార్యక్రమాలను సమాజానికి చేరవేయడంలో పారదర్శకతను కొనసాగిస్తాను” అన్నారు.డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి పిఆర్ఓగా తిరిగి నియమించబడటం పట్ల కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థి వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.
previous post

