Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

సమర్థవంతం గా చెత్త శాంపిల్ ల సేకరణ: : బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్: గ్రేటర్ వరంగల్ నగరంలో
సమర్థవంతం గా చెత్త శాంపిల్ ల సేకరణ చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు.శుక్రవారం వరంగల్ పరిధి పోతన నగర్ లో గల బయో మిథనైజేషన్ ప్లాంట్ తో పాటు ఎన్ ఐ యు ఏ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎఫ్సైర్స్) వారు సేకరిస్తున్న చెత్త శాంపిల్స్ తీరు ను కమిషనర్ పరిశీలించి సమర్థవంతం గా చేపట్టుటకు తగు సూచనలు చేశారు.ఈ సందర్భం గా కమిషనర్ మాట్లాడుతూ నగరం లోని వివిధ ప్రాంతాల్లో ఏ రకమైన చెత్త వస్తుందో అధ్యయనం నిర్వహించి నివేదిక ఇవ్వడానికి వీలుగా ఎన్ ఐ యు ఏ వారు నగరం లోని వివిధ ప్రాంతాల నుండి చెత్త శాంపిల్స్ ను సేకరించి ఆ ప్రాంతం నుండి ప్లాస్టిక్, కాగితం, ఆహార పదార్థాలు తదితర వ్యర్థాలను సేకరించి అందులో గల రసాయనాలను గుర్తించి ఆ ప్రాంతం లో ఏ రకమైన చెత్త వ్యర్థాలు వస్తున్నాయో గుర్తించడం వల్ల భవిష్యత్తులో ఆ ఏరియా లో ఎలాంటి ప్లాంట్ లు ఏర్పాటు చేయడానికి అనుకూలమో రిపోర్ట్ అందజేస్తారని ఇందులో భాగం గా కేటగిరైజేషన్ సెగ్రిగేషన్ శాంపిల్ కలెక్షన్ అంశాల పై దృష్టి సారించి గుర్తింపు చేపడతారని ఈ ప్రక్రియ ను ప్రతి సంవత్సరం చేపట్టడం వల్ల ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని కమిషనర్ అన్నారు.
ఈ కార్యక్రమం లో సానిటరీ సూపర్ వైజర్ లు గోల్కొండ శ్రీను నరేందర్ తో సానిటరీ ఇన్స్పెక్టర్ లు మధు రాజు తదితరులు పాల్గొన్నారు

Related posts

వరంగల్ జిల్లాలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ పర్యటన

కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ సమ న్యాయం: మంత్రి కొండా సురేఖ

రంగాపురం లో ఘనంగా గురు పుజోత్సవం

Jaibharath News