(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్)
మహారాష్ట్ర లోని షిరిడీలో జరుగుతున్న ఆల్ ఇండియన్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జాతీయ మహాసభల జాతీయ అధ్యక్షులు సురేష్ లంబ అధ్యక్షతన జరిగాయి. రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ నాయకత్వంలో టీఎన్జీఓస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ కార్యదర్శి వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిల భారత ఉద్యోగుల సమైక్య సమావేశాలలో సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఆదాయ పన్ను పరిధిని పెంచాలని, ప్రవేటైజేషన్ ను వ్యతిరేకించలని,కాంట్రాక్ట్ హౌసెస్ విధానాన్ని రద్దు చేయాలని సమావేశంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారుఈ సమావేశాలలో అనేక తీర్మాలు చేసినట్టు జిల్లా అధ్యక్షులు రామ్ కిషన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు రాష్ట్ర కోశాధికారి ముత్యాల సత్యనారాయణ , భూపాలపల్లి అధ్యక్షులు బూరుగు రవి కార్యదర్శి రామారావు చిరంజీవి వివిధ జిల్లాల బాధ్యులు పాల్గొన్నారు


