Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

వరంగల్ జిల్లా కలెక్టర్‌కు విశిష్ట గౌరవం

(భారత్ వాయిస్ న్యూస్ వరంగల్)
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి వేడుకల్లో వరంగల్ జిల్లాకు మరో విశిష్ట గౌరవం దక్కింది.
ఎన్నికల నిర్వహణలోవినూత్న ఓటర్ల అవగాహన కార్యక్రమాలు, శిక్షణ, సామర్థ్యాభివృద్ధి రంగంలో చేసిన ఉత్తమ కృషికి గాను వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు .జనవరి 25హైదరాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా ఈ అవార్డును కలెక్టర్ స్వీకరించనున్నారు.కలెక్టర్ దిశా నిర్దేశంలో ఎన్నికల ప్రక్రియలో కీలక పాత్ర వహించే ఎన్నికల అధికారులు, సహాయక అధికారులు, పోలింగ్ సిబ్బంది, పరిశీలకులకు ముందస్తుగా మరియు నిరంతరంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.ఎన్నికల నిబంధనలు, విధివిధానాలపై స్పష్టమైన అవగాహన కల్పించడం, సిబ్బంది నైపుణ్యాలను మెరుగుపరచడం, పారదర్శకతతో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టడం ఈ అవార్డుకు ప్రధాన కారణంగా నిలిచాయి.  వినూత్న ఓటర్ల అవగాహన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రజాస్వామ్యంపై ప్రజల్లో నమ్మకం పెంపొందించడంలో జిల్లా ఎన్నికల యంత్రాంగం విశేషంగా కృషి చేసింది.ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ,జిల్లా యంత్రాంగం, ఎన్నికల అధికారులు, సిబ్బంది అందరి సమష్టి కృషి వల్లే ఈ అవార్డు సాధ్యమైంది” అని తెలిపారు.ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన ప్రతి ఒక్క అధికారికి కలెక్టర్ అభినందనలు తెలిపారు.ఈ అవార్డు వరంగల్ జిల్లా ఎన్నికల యంత్రాంగం ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి, సుశిక్షిత సిబ్బందితో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించగల సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోందని అధికారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Related posts

మోడల్ కూరగాయల మార్కెట్ గా తీర్చిదిద్దుతాం: మంత్రి కొండా సురేఖ

సన్న బియ్యం పంపిణీ దేశానికి ఆదర్శం మంత్రి కొండా సురేఖ

బంజారా భవన్ కు మంత్రి సత్యవతి రాథోడ్ శంకుస్థాపన

Jaibharath News