Jaibharathvoice.com | Telugu News App In Telangana
జాతీయ వార్తలు

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాందేడ్ గురుద్వారా సందర్శన

జై భారత్ వాయిస్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  మహారాష్ట్ర ముఖ్యమంత్రి  దేవేంద్ర ఫడ్నవిస్ తో కలసి నాందేడ్ లోని Takhat Sachkhand Sri Hazur Abchalnagar Sahib తఖ్త్ సచ్ కండ్ గురుద్వారాను ఆదివారం సందర్శించారు. సిక్కుల 10వ మత గురువు శ్రీగురు గోవింద్ సింగ్ సాయిబా వారి సమాధి మందిరాన్ని దర్శించుకున్నారు. సిక్కుల ఐదు అత్యున్నత పీఠాల్లో ఒకటి అయిన గురు ద్వారా హజూర్ సాహిబాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. శ్రీగురు తేగ్ బహదూర్ సింగ్ 350వ షాహిదీ సమాగమంలో పాల్గొనేందుకు నాందేడ్ విచ్చేసిన శ్రీపవన్ కళ్యాణ్  సచ్ ఖండ్ గురు ద్వారాను సందర్శించారు. ఆయనకు గురుద్వారా ఛైర్మన్ డాక్టర్ విజయ్ సత్పాల్ సింగ్ ఆధ్వర్యంలో సాదరంగా స్వాగతం పలికారు. గురు ద్వారా ప్రముఖుల చేతుల మీదుగా  పవన్ కళ్యాణ్ కి సంప్రదాయ సిక్కు తలపాగాను ధరించారు. అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఫడ్నవిస్ తో కలసి పవన్ కళ్యాణ్  గురుద్వారాలో ప్రవేశించారు. ప్రధాన మందిరంలో శ్రీ గురుగోవింద్ సింగ్ సాయిబాకు ప్రార్ధనలు చేశారు. చాదర్ ను సమర్పించి నమస్కరించారు. అనంతరం గురుద్వారా గ్రంథీలు పవిత్ర వస్త్రాన్ని పవన్ కళ్యాణ్ కి, ఫడ్నవిస్ కి వేసి ఆశీర్వదించారు. అనంతరం సమాధి మందిరం లోపల భాగంలో ప్రదక్షిణ ముగించుకుని వెలుపలికి వచ్చారు. గురుద్వారా ఎదుట అత్యంత పవిత్ర స్థలంగా సిక్కు సోదరులు పూజించే నిషాన్ సాహిబ్ వద్ద ఏర్పాటు చేసిన ధ్వజానికి మొక్కారు. దర్శనం అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి  దేవేంద్ర ఫడ్నవిస్ తో కలసి గురుద్వారా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ డొనేషన్ మెషీన్ ను  పవన్ కళ్యాణ్  ప్రారంభించారు.పవన్ కళ్యాణ్ కి ఘన సత్కారం అంతకు ముందు మొదటిసారి సచ్ కండ్ గురుద్వారాకి విచ్చేసిన  పవన్ కళ్యాణ్ ని ఛైర్మన్ ఆధ్వర్యంలో సిక్కు మత పెద్దలు ఘనంగా సత్కరించారు. గురుద్వారా జ్ఞాపికను, సిక్కులు ధరించే పవిత్ర ఆయుధం కిర్పాన్ ను బహూకరించారు.గురు తేగ్ బహదూర్ సింగ్ స్ఫూర్తిని త్యాగం స్ఫూర్తిదాయకంగురుద్వారా సందర్శన అనంతరం  పవన్ కళ్యాణ్  స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ దేశం మొత్తానికి స్ఫూర్తిని నింపారు. ఆయన త్యాగం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని నింపుతుంది. అలాంటి గురువు షాహిదీ సమాగమంలో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను అన్నారు.


Related posts

చిన్నపిల్లలతో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్

బాత్రూమ్ లోకి స్నానాకి వెళ్ళిన వ్యక్తి భయంతో బయిటికి పరుగులు

మధ్యప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ కి ఎదురుదెబ్బ

Jaibharath News