జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
వరంగల్ జిల్లా కలెక్టర్ చాంబర్లో గురువారం గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే లో భూములు కోల్పోయిన సంగెం మండలం లోని రైతులతో జిల్లా కలెక్టర్, సత్య శారద ఆధ్వర్యంలో ఆర్బిట్రేషన్ నిర్వహించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే 163జి నిర్మాణంలో భూములు కోల్పోయిన 8 మంది రైతుల ఆర్బిట్రేషన్ పూర్తయిందని అన్నారు.ఈ ఆర్బిట్రేషన్ లో వరంగల్ ఆర్డీవో సుమ, సంగెం తహశీల్దార్ రాజ్ కుమార్ కలెక్టరేట్ పర్యవేక్షకులు విశ్వ ప్రసాద్, రైతులు పాల్గొన్నారు.

