జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం
దక్షిణ భారతదేశంలో భక్తిశ్రద్ధలతో అత్యంత రమనీయంగా జరిగే భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ ప్రతినిధులు, ఆలయ అర్చకులు ఆహ్వానించారు. ఈ నెల 19 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 27 న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా దేవాదాయ శాఖ ప్రతినిధులు, ఆలయ అర్చకులు ముఖ్యమంత్రినిఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,మంత్రులు కొండా సురేఖ , తుమ్మల నాగేశ్వర రావు ,పొంగులేటి శ్రీనివాస రెడ్డి మంత్రులు కలిసి ఆహ్వానం అందించారు.


