April 7, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గీసుకొండలో భగవద్గీత పారాయణం

జై భారత్ వాయిస్ గీసుగొండ

ప్రజలందరూ ధర్మ బద్ధంగా నడుచుకేందుకు భగవద్గీత పారాయణం ఉపయోగపడుతుందని చిన్మయ మిషన్ హన్మకొండ శాఖ ఇంఛార్జి లతిక మాతాజీ, అన్నారు గీసుకొండ మండలకేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సహిత శ్రీవేణుగోపాలస్వామి దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా ఆదివారం భగవద్గీత పారాయణం నిర్వహించారు. ఈకార్యక్రమంలో చిన్మయ మిషన్ హన్మకొండ శాఖ ఇంఛార్జి లతిక మాతాజీ, గీసుకొండ ప్రైమరీ స్కూల్ టీచర్స్ ఉషారాణి, . నమ్రత, ఎల్ ఐ సి ఉద్యోగి వి. చంద్రశేఖర్, పింగళి కాలేజీ సంస్కృతం లెక్చరర్ ఎన్. శ్రీవిద్య, టీసీఎస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వి. హరిప్రియ పాల్గొని భగవద్గీత  సామూహిక పారాయణం చేయించారు. వీరితోపాటు అర్చకులు పాకాల శ్రీనివాస్, దేవాలయ కమిటీ సభ్యులు తాటికొండ బ్రహ్మచారి, బండారు నరేందర్, కర్ణకంటి రాంమూర్తి, బోడకుంట్ల ప్రభాకర్, మహిళలు నర్శెట్టి శ్రావణి, బండారు శోభ, సుభద్ర   పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

ప్రజా పాలన సేవా కేంద్రాన్ని వినియోగించుకోవాలి.ఎంపిడిఓ క్రిష్ణవేణి.

ప్రశస్త్ యాప్ విద్యార్థులకు ఎంతో ఉపయోగం

ప్రజాస్వామ్య పరిరక్షణ కు ఓటే ఆయుధం: వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి