(జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం)
చత్తీస్గడ్ లో జరుగుతున్న ప్రథమ ఖేలో ఇండియా గిరిజన క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటారు. సర్ గుజలో జరుగుతున్న రెజ్లింగ్ పోటీలో మంగళవారం జరిగిన పోటీలో మంచి పోరాట పటిమ కనబరిచి ఒక స్వర్ణ , రెండు కాంస్య పతకాలు సాధించగా అథ్లెటిక్స్ లోక రజతం సాధించారు. రెజ్లింగ్ మహిళల 57 కేజీల విభాగంలో నాగలక్ష్మి పసిడి పతకం సొంతం చేసుకుంది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఆమె కర్ణాటకకు చెందిన సాయి సిద్ధిపై 10 -0 స్కోర్ తో ఘన విజయం సాధించింది. గ్రీకో రోమన్ 77 కేజీలో కాంస్య పతక పోరులో జాదవ్ చరణ్ హనీష్ కుమార్ (ఛత్తీస్ గడ్) పై 8-0 తేడాతో గెలుపొంది కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. పురుషుల గ్రీకో రోమన్ 135 కేజీల నార్డిక్ విభాగంలో రాజు కాంస్య పతకం గెలుచుకున్నాడు. జగ్దల్పూర్ లో జరిగిన అథ్లెటిక్స్ లో 110 మీటర్ల హడ్డిల్స్ లో దత్తు రజతం సాధించడం విశేషం. ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండి సోనీ బాలాదేవి, ఈ పోటీల చీఫ్ డీ మిషన్ గుగులోతు అశోక్ కుమార్, రెజ్లింగ్ కోచ్ మూడ్ జైపాల్ లు అభినందించారు.

