వ్యాధి బాధితులకు భరోసా సిఎం సహాయనిధి
..ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
అనారోగ్యంతో బాధపడుతున్న వ్యాధి బాధితులకు భరోసాగా సిఎం సహాయనిధి నిలిచిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.బుధవారం హన్మ కొండ జిల్లా ఆత్మకూరు మండలం లింగమడుగుపల్లి గ్రామానికి చెందిన జే.జనీత్ కి రూ.4లక్షల ఎల్ ఓ సీ లెటర్ ను అందచేశారు.ఈ కార్యక్రమంలో రైతు బందు కమిటీ అధ్యక్షుడు ఎన్కతాల్ల రవీందర్, బి అర్ ఎస్ జిల్లా నాయకుడు వేముల నవీన్ తదితరులు పాల్గొన్నారు.