Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ముస్త్యాలపల్లిలో శ్రావణ మాసం పోచమ్మ బోనాల పండుగ

జై భారత్ వాయిస్ దామెర

దామెర మండలం ముస్త్యాలపల్లిలో శ్రావణ మాసం పురస్కరించుకుని పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. బుధవారం ముస్త్యాలపల్లి గ్రామ సర్పంచ్ వడ్డేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగను ఎంతో వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా డప్పు చప్పుళ్ల మధ్య మహిళలు తలపై బోనం ఎత్తుకుని వరుస క్రమంలో పోచమ్మ దేవాలయం చేరుకున్నారు. ఆ తరువాత దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ నేపథ్యంలో మహిళలు పోచమ్మ తల్లికి కొబ్బరి కాయలు కొట్టి, పసుపు, కుంకుమలు సమర్పించారు. తమ ఆచార, సంప్రదాయ పద్ధతిలో అమ్మ వారికి నైవేధ్యం, పడులు పెట్టి తమను చల్లగా చూడాలని మొక్కులు సమర్పించారు. అనంతరం పోచమ్మ తల్లి అమ్మ వారికి గొర్రె పోతులను, కోళ్లను బలి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వడ్డపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీల ఫోరం చైర్మన్ నేరెళ్ల కమలాకర్, మాజీ ఎంపీటీసీ బండారి వీరస్వామి. వార్డు సభ్యులు తోట శ్రీనివాస్, బీఅర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చిలువేరు రాజు, బాగాది కుమార్, చిల వేరు రాజు. తోట అకిల్, పిల్లలు, పెద్దలు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు

Related posts

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి

Jaibharath News

ప్రతీ ఒక్కరూ నేత్ర దానం చేయాలి

Jaibharath News

గృహలక్ష్మి లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందించిన ఎమ్మేల్యే

Jaibharath News