గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అత్యవసరం – పద్మావతి .
(జై భారత్ వాయిస్ అత్మకూరు) :
గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అత్యవసరం ఐ సి డి ఎస్ సూపర్ వైజర్ పద్మావతి అన్నారు . శుక్రవారం మండలంలోని హౌజుబుజుర్గు గ్రామంలో పోషణ మాసం లో భాగంగా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పౌష్టికాహారం వాటి విలువలు , తీసుకోవాల్సిన జాగ్రత్తలు సలహాలు సూచనలు అవగాహన సదస్సు సూపర్ వైజర్ పద్మావతి వివరించారు. అనంతరం మహిళలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అరుణ,అంగన్వాడీ టీచర్ రమాదేవి, వార్డు సభ్యురాలు మధీన,సిఒ భాగ్య, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

previous post