Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మంత్రి కేటీఆర్bకి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

జై భారత వాయిస్ warangal
వరంగల్ తూర్పు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తనపై నమ్మకంతో రెండవసారి ప్రకటించడం పట్ల దుబాయ్ పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకొని హైదరాబాద్ విచ్చేసిన సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,ఐటి పురపాలన శాఖ మంత్రి కేటిఆర్ ని మర్యాద పూర్వకంగా కలిసి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కృతజ్ఞతలు తెలిపారుఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కి శుభాకాంక్షలు తెలిపారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటిఆర్ వరంగల్ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కి ప్రకటించడం పట్ల దుబాయ్ పర్యటనకు వెళ్లి తెలంగాణ కు భారీ పెట్టుబడులు తీసుకోని రావడానికి కృషి చేసి విజయవంతంగా పర్యటన ముగించుకుని హైదరాబాద్ విచ్చేసిన మంత్రి కేటీఆర్ ని మర్యాద పూర్వకంగా కలిసి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.శాలువతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు
ప్రజా ఆశీర్వాదం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి కెసిఆర్,వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తు ప్రజాసేవలో ముందుంటానని ఎమ్మెల్యే నరేందర్ తెలిపారు.

Related posts

ఉద్యోగ సంఘాల నేతలపై లచ్చిరెడ్డి చేసిన ఆరొపనలో నిజం లేదు

ఘనంగా మహమ్మద్ ప్రవర్త జన్మదిన వేడుకలు     

మల్టీ పర్పస్ వర్కర్ల సేవలు మరువలేనివి.-వారి పాదాలు కడుగుతాం.