Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృతి

జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
  ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన ఆత్మకూరు మండలంలోని గూడెప్పాడుశివారు 163 జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది.
ఎస్సై రాజేష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గూడెప్పా డు గ్రామానికి చెందిన మేక స్వామి రెడ్డి(70) వ్యవసాయ పనుల నిమిత్తం సైకిల్ పైన వ్యవసాయ బావి వద్దకు వెళుతుండగా గూడే ప్పాడు గ్రామ శివారులోని రోడ్డు క్రాస్ చేస్తుండగా ములుగు నుండి హనుమకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్ వేగంగా వచ్చి స్వామి సైకిల్ ను ఢీకొట్టగా తీవ్ర గాయాలైన స్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునిభార్య సరోజినమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Related posts

పద్మ బ్రాహ్మణులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు జారీ చేయాలి  

ఆత్మకూరు లో వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

Jaibharath News

ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయొద్దు …….