(జై భారత్ వాయిస్ ఆత్మకూరు);
ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాలలో నెలకొల్పిన గణనాథుల నిమజ్జనోత్సవం కటాక్షపూరు చెరువు వద్ద వైభవంగా నిర్వహించారు. నిమజ్జనం సందర్భంగా కటాక్షపూర్ లో క్రేను తదితర ఏర్పాట్లను చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆత్మకూరు సిఐ దండుగుల రవిరాజు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నిమజ్జనా స్థలాన్ని ఈస్ట్ జోన్ డిసిపి పులిగిల్ల రవీందర్ ,డిపిఓ జగదీశ్వర్ తదితరుల అధికారులు సందర్శించారు. ప్రతి గ్రామం నుండి వచ్చే వినాయక విగ్రహాలను కటాక్షపూరు చెరువులో జాగ్రత్తగా గజ ఈతగాళ్ల మధ్యన నిమజ్జనం చేశారు .ఈ నిమజ్జనం అర్ధరాత్రి వరకు కొనసాగుతున్నది. గ్రామాల నుంచి ట్రాక్టర్లను ఆటోలలో ట్రాలీలలో వినాయక విగ్రహాలను కటాక్షపూర్ చెరువు వద్దకు తీసుకుని వచ్చి భక్తులు నిమజ్జనం చేశారు. గత తొమ్మిది రోజుల అత్యంత భక్తిశ్రద్ధలతో గణ పతిని సేవించి ఆఖరి రోజు అయిన బుధవారము విగ్రహాలను ఊరేగింపులు డప్పు చప్పుల మధ్యన కటాక్షపూర్ పెద్ద చెరువు వద్దకు తీసుకొని వచ్చి నిమజ్జనం చేశారు. కటాక్షపూర్ వద్ద లైటింగ్ తదితర ఏర్పాట్లను చేశారు. వైద్య సిబ్బంది నిరంతరము పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఎప్పటికప్పుడు పోలీసులు భక్తులకు తగు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో , తహశీల్దార్ సురేష్ కుమార్, ఎంపీఓ చేతన్ కుమార్ రెడ్డి, సి ఐ రవి రాజు, ఎం ఆర్ ఐ హేమా నాయక్, ఆత్మకూరు ఎంపిపి మార్క సుమలత, స్ధానిక సర్పంచ్ రబియా హుస్సేన్, కటాక్ష పురం సర్పంచ్ మచ్చిక యాదగిరి, తదితరులు పాల్గొన్నారు
