బాల్యం నుండే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి
-బ్యాడ్మింటన్ విజేతను సత్కరించిన ఎస్సై ప్రసాద్…
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు),ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో అండర్ 11 ట్రోఫీ ని గెలుచుకున్న అక్షయ్ ని మంగళవారం ఆత్మకూరు ఎస్సై జి.ప్రసాద్ సన్మానించారుఈ సందర్భంగా ఎస్సై ప్రసాద్ మాట్లాడుతూ బాల్యం నుంచే క్రీడల పట్ల మక్కువ చూపిస్తున్న అక్షయ్ నేడు రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి గెలుచుకోవడం అభినందనీయంమని నవంబర్ లో జరుగబోయే జాతీయ స్థాయి టోర్నమెంట్ లో రానిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం ప్రముఖ వైద్యులు డాక్టర్ పురాణం వెంకట్ రాములు మాట్లాడుతూ అక్షయ్ భవిష్యత్ లో జాతీయ స్థాయిలో రాణించి , తల్లిదండ్రులకు గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సత్యసాయి ఇండోర్ స్టేడియం క్రీడాకారులు ప్రభుత్వ ఉపాధ్యాయులు బుచ్చిరెడ్డి , యూనియన్ బ్యాంకు శంకర్ , రాజేష్, శ్రీను, నరేష్, శరత్, చందు,అనిల్ , శ్యామ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.