Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

యువత క్రీడల్లో రాణించాలి

యువత ఆటల్లో రాణించాలి

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
ప్రభుత్వం సరఫరా చేసిన క్రీడా పరికరాలను వినియోగించుకుని గ్రామాల్లో క్రీడ ల్లో రాణించాలని ఆత్మకూరు ఎంపిపి మార్క సుమలత అన్నారు. బుధవారం మండల్ పరిషత్ కార్యాలయంలో కేసీఆర్ స్పోర్ట్స్ కిట్ ల పంపిణీ జరిగింది. యువత స్మార్ట్ ఫోన్ మాయాజాలం లో పడకుండా ఉదయం, సాయంత్రం ప్రభుత్వ పాఠశాలలో ని క్రీడా ప్రాంగణాల్లో ఆడుకుని నైపుణ్యం సాధించాలని కోరారు. జడ్పీటీసీ కక్కర్ల రాధిక మాట్లాడుతూ యువతీ యువకులు చెడు మార్గం పట్టకుండా ఏదైనా ఆటలో రాణిస్తే బహుమతులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా ఉంటుందన్నారు. ఎంపీఓ చేతన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని 15 గ్రామాలకు వాలీబాల్, క్రికెట్, డoబెల్స్ కిట్లను అందచేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లు వరుణ్, సర్పంచులు యాదగిరి, రాజు, రజియా బేగం రంపిస మనోహర్, పి.ఇ. టి లు గ్రేస్, కిషన్, సూపరింటెండెంట్ పంచాయతీ కార్యదర్శులు వసంతరామ్, మేడ యాదగిరి, రవి,అనూష, కల్యాణి, సునీల్,లావణ్య, పాల్గొన్నారు.

Related posts

BJP సభ్యత్వం నమోదులో భాగంగా హనుమకొండకు విచ్చేసిన కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్

Sambasivarao

నూతన రెవెన్యూ (ఆర్ఓఆర్ )-2024 ముసాయిదా చట్టం పై చర్చా

ఆత్మకూరు మండలం కేంద్రం లో ఫొటొటెక్  పొస్టర్ ను ఆవిష్కరించినమండల అధ్యక్షులు  వెలిదే లక్ష్మణ్