జై భారత్ వాయిస్ దామెర
పోచంపల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో అందిస్తున్న కుట్టుమిషన్లను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ల ఫోరం చైర్మన్ గట్ల విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా బుధవారం దామెర మండలం కోగిల్వాయి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమలంలో మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం పోచంపల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేసి, ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోల్కొండ సాంబయ్య, జీపీ సెక్రటరీ సరళ, కోఅప్షన్ సభ్యుడు అక్తర్, వార్డు సభ్యులు గుండా రజిని. జంగిలి నవ్యశ్రీ, కారోబార్ యజ్ఞం సురేష్, సల్ల అర్జున్, ఏఎన్ఎం స్వరూప, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

previous post