జై భారత్ వాయిస్ గీసుకొండ
పీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రం మమునూరు పరిధిలో ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ డాక్టర్ రాజన్న అధ్వర్యంలో కేంద్రీయ ప్రత్తి పరిశోధన స్థానం ప్రత్యేక శాస్త్రవేత్తల బృందం అదిక సాంద్రతలో ప్రత్తి సాగు విధానం పైన సంగెం మండలంలోని చింతపల్లి నల్లబెల్లి గ్రామాలలో, గీసుకొండ మండలంలోని అనంతారం ఎల్కుర్తి గ్రామంలో, దుగ్గొండి మండలంలోని మూద్దునూర్ లో క్షేత్రస్థాయి ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్బంగా కేంద్రీయ అదిక సాంద్రత ప్రత్తి విభాగం శాస్త్రవేత్తల బృందం సీనియర్ శాస్త్రవేత్త డా. శంకర్ నారాయణన్, శాస్త్రవేత్త మని వరణన్, శాస్త్రవేత్త శంకర్ గణేశన్,జాతీయ ఆహార భద్రత మిషన్ కన్సల్టెంట్ వరంగల్ పి. సారంగం, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డా. సౌమ్య, డా. రాజు, యంగ్ ప్రొఫెషనల్ రాజేష్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ సంప్రదాయ పద్ధతిలోలో పండించే ప్రత్తి పంట కంటే అదిక సాంద్రతలలో ప్రత్తి పంట వేయడం వలన రైతులు అధికంగా దిగుబడులు పొందవచ్చునని, పంట కాలం త్వరగా పూర్తి అవుతుందని, యాసంగిలో ఇతర పంట కూడా వేసుకోవచును అని, దీనితో పాటు గులాబీ రంగు పురుగు ఉదృతి నుండి పంటను కాపడుకొచునని తెలిపారు.
ప్రస్తుతం ప్రత్తి పంట 90 నుండి 120 రోజులతో పూత మరియు కాయ వేసే దశలో ఉందని. ఈ దశలో పచ్చ దోమ, గులాబీ రంగు పురుగు ఉదృతి గమనించడం జరిగిందని చెప్పారు.. దీని ఉనికిని గుర్తించడానికి ఎకరానికి 8 లింగాకార్షక ఎరలు అమర్చుకావాలని, గ్రుడ్డి పూలను ఎరి వేయాలని మొదటి దశలో వేపనూనె లీటరు నీటికి 5 మిల్లీ లీటర్ ప్రోఫినోఫోస్ 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేయవలెను అని సూచించారు. పచ్చ దోమను నివారించడానికి ఫ్లునికమైడ్ 0.3 మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మరియు నూజివీడు సీడ్స్ ఏజిమ్ నర్సింహ రెడ్డి, రీజనల్ మేనేజర్ రమణారెడ్డి, ఏరియా మేనేజర్ మురళీమోహన్, సీనియర్ మార్కెటింగ్ ఆఫీసర్ నాగరాజు, రాసి సీడ్స్ ప్రతినిధులు సూర్యప్రకాష్ మరియు మహికో సీడ్స్ విష్ణువర్ధన్ రెడ్డి ఎఈఓ లు అఖిల, విజయ్ తదితర రైతులు పాల్గొన్నారు.

next post