Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

రైతులకు రక్షణగా ముఖ్యమంత్రి కేసీఆర్

రైతులకు ర‌క్ష‌ణ క‌వ‌చంలా ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిలిచారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.ఆదివారం గీసుకొండ మండల పరిధిలోని మొగిలిచెర్ల లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో.52.00 లక్షలతో నూతనంగా నిర్మించిన 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదామును సొసైటీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి డిసిసిబి చైర్మన్ మారినేని రవీందర్ రావుతొ కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఒక‌ప్పుడు ఎస్సారెస్పీ కాలువలు ఎండిపోయి రైతులు ఆగ‌మ‌య్యేదని ఎమ్మెల్యే తెలిపారు. మ‌నం రివ‌ర్స్ పంపింగ్ చేప‌ట్టిన త‌ర్వాత ఎస్సారెస్పీ నిండుకుండ‌లా మారింది. స‌ముద్రంలాగా క‌న‌బ‌డుతుందని . ఇది కేసీఆర్ వ‌ల్లే సాధ్య‌మైందని అన్నారు.సాగునీటి విష‌యంలో క‌ష్టాలు త‌ప్పాయన్నారు.వ్యవసాయానికి 24 గంట‌ల‌ క‌రెంట్ వ‌స్తుందంటే.. రైతుబంధు తీసుకొని ధైర్యంగా వ్య‌వ‌సాయం చేస్తున్నాడంటే అందుకు కేసీఆర్ కార‌ణమని అన్నారు. రైతుబీమాతో రైతుల కుటంబాల‌ను ఆదుకుంటున్నాం. అదే విధంగా రైతు పండించిన ధాన్యాన్ని మద్దతుధర కేటాయించి కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్ గారిదన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కావడం మనందరి అదృష్టం.నేడు మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్,బిజెపి పాలిత రాష్ట్రాల్లో లేవన్నారు.వారికి అక్కడ అమలు చేసే దమ్ములేదుకాని ఇక్కడ సాధ్యంకాని హామీలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారన్నారు. గత పది సంవత్సరాల క్రితం తెలంగాణ ఎలా ఉండే,ఇప్పుడు ఎలా ఉందో ప్రజలంతా ఆలోచించారు.పనిచేసే వారికి పట్టం కట్టాలని ప్రజలను కోరారు.ప్రజల సంక్షేమమే
బి.ఆర్.ఎస్. ఎజెండా అని పేర్కొన్నారు.ఎండ్లకేండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎన్నికలు రాగానే ఎదో చేస్తామని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు.గ్యారంటీ పథకాలు అని వస్తున్న కాంగ్రెస్ పార్టీకే తెలంగాణలో గ్యారంటీ లేదని అన్నారు.వచ్చే ఎన్నికల్లో ఎన్ని ప్రయత్నాలు చేసిన బిజెపి లేవదు,కాంగ్రెస్ గెలవదని అన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు,సొసైటీ చైర్మన్లు, కమిటీ సభ్యులు,బి.ఆర్.ఎస్.నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సీఎంరిలీఫ్ ఫండ్, కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి కొండ సురేఖ

గోపాల నవీన్ రాజుని కలిసిన టీబీసీపీస్ జిల్లా అధ్యక్షుడు దయ్యాల ప్రభాకర్

Sambasivarao

ప్రజల నుంచి వచ్చిన వినతుల సమస్యలను అధికారులు పరిష్కరించాలి మంత్రి కొండా సురేఖ అదేశాలు