సమాజ సేవలో పూర్వ విద్యార్థులు భాగం అవ్వాలి…
-విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఐ. కృష్ణారెడ్డి…
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
నేటి సమాజానికి యువత ఆదర్శప్రాయంగా తయారవ్వాలని, సమాజ సేవకు భాగం పంచుకోవాలని విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు ఇనగాల కృష్ణారెడ్డి అన్నారు. ఆత్మకూరు మండలం నీరుకుల్ల పాఠశాలలో 1986 – 87 సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆదివారం మండలంలోని నీరుకుల్ల జెడ్. పి .ఎస్ .ఎస్. పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. అనంతరం మన్నే బాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ నేటి సమాజం కోసం ఉపయోగపడే కార్యక్రమాలను పూర్వ విద్యార్థులు రూపొందించాలని పిలుపు నిచ్చారు. ఇలాంటి కార్యక్రమాలను ఎన్నెన్నో చేయాలని సూచించారు.1986-87 పూర్వ విద్యార్థులు పరపతి సంఘం ఏర్పాటు చేసుకొని పలువురిని ఆదుకోవడం అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను, రాష్ట్ర ఉత్తమ రైతులను ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థుల్లో ప్రమోషన్ పొందిన వివిధ శాఖల చెందిన వారిని విశ్రాంత ఉపాధ్యాయులు సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు ఏం. సదానందం , బీమగాని శంకరయ్య, చేరాలు, సతీషు, ఏ. కొమురయ్య, పూర్వ విద్యార్థులు -పరపతి సంఘం అధ్యక్షులు చలకాని ధనుంజయ, కోశాధికారి పులిచేరు సదానందం, చిట్టి బొమ్మల భాస్కర్, పోతరాజు ఈశ్వరయ్య, సూరం నారాయణ రెడ్డి, వి.సంపత్, కే. సుదర్శన్, బి.అన్నపూర్ణ పి. లక్ష్మి, రమ ,సుందరి, రాజ కళ, శారద ,లీలామణి శోభ, హేమలత ,పుష్ప, రవి, పెరుమాండ్ల మహేందర్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.