April 6, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
జాతీయ వార్తలుహన్మకొండ జిల్లా

ధర్మారెడ్డి గెలుపు కోసం అరుణాచలంలో ప్రత్యేక పూజలు

జై భారత్ వాయిస్ దామెర
రాబోవు శాసన సభ ఎన్నికల్లో పరకాల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తిరిగి మూడో సారి విజయం సాధించాలని హనుమకొండ జిల్లా దామెర మండలం ముస్త్యాలపల్లి సర్పంచ్ వడ్డపల్లి శ్రీనివాస్ వినూత్న రీతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆదివారం తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలంలో సర్పంచ్ వడ్డపల్లి శ్రీనివాస్ తమ కుటుంబ సభ్యులతో పాటుగా ప్రత్యేక పూజాధికాలను జరిపించారు. ఈ క్రమంలో చల్లా ధర్మారెడ్డి విజయం సాధించి మంత్రి పదవి పొందాలంటూ.. 14 కిలో మీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేసి తమ మొక్కులు సమర్పించారు. దీంతో సర్పంచ్ శ్రీనివాస్ తన స్వామి భక్తిని చాటుకున్నాడు.

Related posts

ప్రతీ ఒక్కరూ నేత్ర దానం చేయాలి

Jaibharath News

అందని ద్రాక్షగా మారిన ఇంటర్మీడియట్ మధ్యాహ్న భోజన పథకం

Strict Criminal Action Will Be Taken Against Ragging”