Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గీసుకొండ మండలంలో 144 సెక్షన్‌ అమలు గీసుగొండ సిఐ. రామకృష్ణ

జైభారత్ వాయిస్
గీసుగొండమండలంలో 144 సెక్షన్‌ అమలులో ఉందని
గీసుగొండ సిఐ కె. రామకృష్ణ తెలిపారు. అదివారంనాడు ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉన్నందున ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని పేర్కొన్నారు. డీజేలకు అనుమతులులేదని స్పష్టం చేశారు. బాణ సంచాలను పేల్చడానికి అనుమతి లేదన్నారు. నలుగురి కంటే ఎక్కువమంది గుమి కూడడం నిషేదమన్నారు. ర్యాలీలకు అన్నింటికి ఎలక్షన్‌ కమిషన్‌ వారి ఆదేశాలు అనుమతి తప్పని సరి ఉండాలన్నారు. లేనిచో చట్ట రిత్యా చర్యలు తీసుకుంటామని సిఐ కె. రామకృష్ణ స్పష్టం చేశారు.

Related posts

సీఎం కేసిఆర్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

Jaibharath News

రుణమాఫీ ప్రక్రియను పరిశీలించిన ఏ డి ఏ గౌస్ హైదర్

వరంగల్ లో 14న నిరసన దీక్ష:- బిజెపివరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్