Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

ముఖ్యమంత్రిని కలిసిన ఐజేయూ, టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందం

జై భారత్ వాయిస్ భాగ్యనగర్
తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏ.రేవంత్ రెడ్డిని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీల నేతృత్వంలో ప్రతినిధి బృందం బుధవారం సాయంత్రం సచివాలయంలో కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా జర్నలిస్టుల ప్రధాన సమస్యలపై దృష్టి సారించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఐజేయూ, టీయుడబ్ల్యుజె నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. సీఎంను కలిసిన ప్రతినిధి బృందంలో ఐజేయూ జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కే. సత్యనారాయణ, టీయూడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్,  ఉపాధ్యక్షులు కే.రాంనారాయణ, యూనియన్ నాయకులు కె.రాములు, శిగా శంకర్ గౌడ్ లు ఉన్నారు.

Related posts

MISS WORLD-2025 ప్రపంచ సుందరి 2025 పోటీకి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి .ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

జూన్ చివ‌రినాటికి వ‌రంగ‌ల్ సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ ప‌నులు పూర్తికావాలి

తెలంగాణ హైకోర్టు పరిధిలో 1673 పోస్టులు