గృహలక్ష్మి ఇండ్లను పరిశీలించిన
ఎంపిడిఒ
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు) :
ఇటీవల బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంలో లబ్ధిదారుల కొత్తగా నిర్మించుకున్న ఇండ్లను హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశాల మేరకు గురువారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ఇండ్లను పరిశీలించారు. ఈ మేరకు మండలంలోని కొత్తగట్టు, తిరుమలగిరి కామారం, చౌళ్లపల్లి, గ్రామాల్లోని 13 గృహలక్ష్మి ఇండ్లను, మండల ప్రత్యేక అధికారి జి రామ్ రెడ్డి, ఆత్మకూరు ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇండ్లను పరిశీలించి లబ్ధిదారుల వద్ద ఉన్న స్థలానికి సంబంధించిన పత్రాలు గృహానికి సంబంధించిన ఫోటోలను సేకరించారు సేకరించిన సమాచారాన్ని గృహ నిర్మాణ శాఖకు జిల్లా కలెక్టర్ కి సమర్పించడం జరుగుతుందని ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

previous post