April 7, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

గృహలక్ష్మి ఇండ్లను పరిశీలించిన ఎంపిడిఒ

గృహలక్ష్మి ఇండ్లను పరిశీలించిన
ఎంపిడిఒ
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు) :
ఇటీవల బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంలో లబ్ధిదారుల కొత్తగా నిర్మించుకున్న ఇండ్లను హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశాల మేరకు గురువారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ఇండ్లను పరిశీలించారు. ఈ మేరకు మండలంలోని కొత్తగట్టు, తిరుమలగిరి కామారం, చౌళ్లపల్లి, గ్రామాల్లోని 13 గృహలక్ష్మి ఇండ్లను, మండల ప్రత్యేక అధికారి జి రామ్ రెడ్డి, ఆత్మకూరు ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇండ్లను పరిశీలించి లబ్ధిదారుల వద్ద ఉన్న స్థలానికి సంబంధించిన పత్రాలు గృహానికి సంబంధించిన ఫోటోలను సేకరించారు సేకరించిన సమాచారాన్ని గృహ నిర్మాణ శాఖకు జిల్లా కలెక్టర్ కి సమర్పించడం జరుగుతుందని ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Related posts

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతఆత్మకూరు ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి

prajavani ప్రజావాణి వినతులను వెంటనే పరిష్కరించాలి-హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

కేయూ భూములపై పారదర్శనంగా సమగ్ర విచారణ చేపట్టాలి బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం నాయకులు