Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలలో దివ్యగులకు ప్రాధాన్యత.. జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

జై భారత్ వాయిస్ . ప్రభుత్వం అందిస్తున్న   సంక్షేమ పథకాలలో దివ్యంగులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య పేర్కొన్నారు.
వరంగల్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య,అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి శారద,
డి ఆర్ డి ఓ సంపత్ రావు, డి యం అండ్ హెచ్ ఓ వెంకటరమణ,డిసిపి రవీందర్, దివ్యాంగుల కమిటీ మెంబర్ చక్రపాణి నర్సక్క తదితరుల తో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ లో అందరితో పాటు కాకుండా దివ్యంగుల కోసం ప్రత్యేకంగా వారి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని అన్నారు.
ప్రతి నెల మూడవ శనివారం దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ ఏర్పాటు చేసి వారి సమస్యల పై తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.ఎంజీఎం ఆసుపత్రిలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఓ.పి సెంటర్ ఏర్పాటుకు సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు.ప్రభుత్వం చే వివిధ రకాల ప్రోత్సాహక పథకాల అమలు జరుగుతున్నప్పటికీ పథకాల పై సరియైన అవగాహన లేకపోవడం వలన పథకాలు దివ్యాంగులకు చేరలేక పోతున్నాయని ఇట్టి విషయంపై సంబంధిత శాఖల జిల్లా అధికారులు, అసోసియేషన్ మెంబెర్స్ అవగాహన కల్పించుటకు చర్యలు తీసుసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అన్నారు.
దివ్యంగుల సంక్షేమానికి ప్రభుత్వ పరంగా వివిధ పథకాలు, ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్ లు ఉన్నాయని, బిజినెస్ పరంగా అవగాహన కలిగిన వారు దరఖాస్తు చేసినట్లు అయితే బిజినెస్ పరంగా ప్రోత్సాహం అందిస్తామని అన్నారు. జిల్లాలో ప్రతి నెల 6 కోట్ల 19 లక్షలు వెచ్చించి 15 వేల 424 మంది దివ్యంగుల కు పెన్షన్లు అందిస్తున్నాం అన్నారు.సదరం సర్టిఫికెట్ల మంజూరిలో బాగంగా యంజియం లో
జరిగిన అవకతవకల పై ఎంక్వయిరీ చేసి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా అన్నారు.ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ హోదాలలో ఉద్యోగులుగా ఉన్న దివ్యంగుల ఆత్మాభిమానం దెబ్బతినకుండా చూసుకోవలసిన బాధ్యత జిల్లా అధికారులు, తోటి ఉద్యోగస్తులపై ఉందని అన్నారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ దివ్యాంగులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదని అసెంబ్లీ ఎలక్షన్లలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో వారిచే విధులు నిర్వహించడం జరిగిందని వారు చాలా నిబద్ధతతో విధులను నిర్వర్తించారని, అందుకు వారిని అభినందించారు. దివ్యాంగుల చట్టం 2016 ను ఖచ్చితంగా అమలు చేయాలని దివ్యాంగుల కమిటీ మెంబర్ చక్రపాణి కోరారు.అనంతరం మల్లిఖాంభ మనో వికాసం కేంద్రం విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడల్లో గెలుపొందిన 77 మందికి సర్టిఫికెట్స్ తో పాటు మేమొంటో ప్రదానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సంబంధిత శాఖల అధికారులు,సిబ్బందితో పాటు జిల్లాలోని దివ్యాంగుల కమిటీ మెంబర్లు దివ్యాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని – ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్

పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి

సంగెం మండలంలో మొదటిరోజు గణనాధుని పూజ…