అగ్రంపహాడు జాతర ప్రదేశాన్ని సందర్శించిన ఆత్మకూరు సి ఐ , అధికారులు
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ స్థాయిలో చిన్న మేడారం జాతరగా ప్రసిద్ధిగాంచిన అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణాన్ని బుధవారం స్థానిక సీఐ డి.రవిరాజు, తహశీల్దార్ సురేష్ కుమార్, ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, జాతర ఈవో శేషగిరిలు సందర్శించారు. అధికారులు, గ్రామ పెద్దలు జాతర పూజారులతో కలిసి మాట్లాడారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ 2024 ఫిబ్రవరిలో జరగబోయే జాతరకు మౌలిక వసతులు ,తదితర అవసరాలను గమనించామని సీఐ తెలిపారు.
