జై భారత్ వాయిస్ న్యూడిల్లీ
వైఎస్ఆర్టీపీ ని కాంగ్రెస్ లో ఆపార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ నాయకుడు రాహూల్ గాంధీ ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో గురువారం నాడు డీల్లిలో విలీనం చేశారు. ఆ పార్టీ నేతలు షర్మిలకు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పిపార్టీలొకి ఆహ్వనించారు. రాహుల్ గాంధీ నీ ప్రధానిగా చూడాలన్నది నా తండ్రి అశయంమని వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో గొప్ప నేతఅని ఆయన ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలూ శ్రమించారని గర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీ విలినం చేశామని నేటి నుండి తమ పార్టీ కార్యకర్తులు నాయకులు కాంగ్రెస్ పార్టీ తో కలసి పార్టీ అభివృద్దికొసం అన్ని వర్గాలను కలుపుకుంటూ, అందరినీ కలుపుతూ పని చేస్తామని చెప్పారు.భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ పై నమ్మకాన్ని నాతో పాటు ప్రజలందరిలో పెంచిందని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించి పోటీ చేయలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఎ భాద్యలు అప్పగించిన శక్తివంచన లేకుండా పనిచేస్తామని అన్నారు.


