జై భారత్ వాయిస్ గీసుకొండ
వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం కేంద్ర ప్రభుత్వ అఖిలభారత సమన్యయ పరిశోధన పథకం-కంది, పంటలో గీసుకొండ మండలం ధర్మారంకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన రైతులకి కంది పంట పై లింగమూర్తి కంది క్షేత్రంలో శిక్షణ కార్యక్రమము క్షేత్రదినోత్సవం శనివారం ఉదయం పదకొండు గంటలకు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య ఆథిగా వరంగల్ ఏరువాక కేంద్రం కో-ఆర్డినేటర్ ఇన్చార్డ్ ఎ.డి.ఆర్. డాక్టర్ దిలిప్ కుమార్ మాట్లాడుతూ కంది పంట సాగు , గణనీయ విస్తీర్ణంలో సాగు పెంచుకోవల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైన ఉందని అన్నారు.వివిధ రకాల పంటల సరళిలో అపరాల సాగు చేయడం వలన పంటలు పెరుగుతు పంట మంచి దిగుబడులు రైతులు పోందాలపి సూచించారు. అపరాల విభాగాని చెందిన డాక్టర్ సంధ్యా కిషోర్ మాట్లాడుతూ వరంగల్ వ్యవసాయ పరిశొధూ స్థానం నుండి మెలైన వంగడాలు W.R.G.E-97, WRGE-93, WRG-255 రకాలు ఎండుతెగులును తట్టుకుంటాయని తెలిపారు. రైతులు పెద్ద మొత్త సాగిు చేయాలని సూచించారు. అగ్రనామి శాస్తవేత్త ఎఫ్ఎల్ డి ఇన్ చార్జీ డాక్టర్ మధు మాట్లాడుతూ కంది పంట కోత, కోతానంతరం తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలిపారు. శాస్త్రవేత్త డాక్టర్ వీరన్న మాట్లాడతూ కందిపటలో కాయ ఈగ లక్షణాలు నివారణ పద్ధతుల గురించి తెలిపారు ఈ శిక్షణ కార్యక్రమంలో గొదాశి లింగమూర్తి ,సంజీవ, రామస్వామి కిషన్ తోపాటు ధర్మారం ,అనంతారంరైతుసోదరులు తదితరులు పాల్గొన్నారు. .
