Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి

(జై భారత్ వాయిస్ వరంగల్ )స్వామి వివేకానంద జయంతి సందర్భంగా గీసుకొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సీఐ రామకృష్ణ వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా  నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సిఐ రామకృష్ణ మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతిని దేశంలో యువజన దినోత్సవంగా జరుపుకుంటారని యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. స్వామి వివేకానంద రామకృష్ణ మఠాన్ని స్థాపించి యువతను సన్మార్గంలో నడిపించేందుకు అనేక బోధనలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఎస్సై సుధీర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Related posts

ప్రశస్త్ యాప్ విద్యార్థులకు ఎంతో ఉపయోగం

సంగెం మండల స్థాయి CM CUP 2024 క్రీడోత్సవాలు

వైస్సార్ 15వ వర్ధంతి సందర్బంగా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యేలు, కుడా చైర్మన్, డీసీసీ అధ్యక్షురాలు