April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి

(జై భారత్ వాయిస్ వరంగల్ )స్వామి వివేకానంద జయంతి సందర్భంగా గీసుకొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సీఐ రామకృష్ణ వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా  నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సిఐ రామకృష్ణ మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతిని దేశంలో యువజన దినోత్సవంగా జరుపుకుంటారని యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. స్వామి వివేకానంద రామకృష్ణ మఠాన్ని స్థాపించి యువతను సన్మార్గంలో నడిపించేందుకు అనేక బోధనలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఎస్సై సుధీర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Related posts

ఆర్చి నూతన బస్సు షెల్టర్   నిర్మాణానికి భూమి పూజ

తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్ టాపర్ గా ఓరుగల్లు విద్యార్థిని

ప్రజా పాలన సేవా కేంద్రాన్ని వినియోగించుకోవాలి.ఎంపిడిఓ క్రిష్ణవేణి.