( జై భారత్ వాయిస్ గీసుకొండ )
గీసుకొండ.మండలములోని 21 గ్రామాలలో నిర్వహించిన అభయ హస్తం ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించిన ధరఖాస్తులను కంప్యూటరీకరణ చేస్తున్న తీరున వరంగల్ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహాధికారి రాంరెడ్డి శుక్రవారం పరిశీలించారు.గీసుకొండ మండల పరిషత్ కార్యాలయంలో చేస్తున్న ఆన్ లైన్ ప్రక్రియ తీరును ఆపరేటర్లను అడిగి తెలుసుకున్నారు.మండలములో 11622 ధరఖాస్తు లు రాగ రెండు నమోదు సెంటర్లు ఏర్పాటు చేసి 10500 ధరఖాస్తు లు ఆన్లైన్ లో నమోదు చేసినట్లు ఎంపిడిఓ యన్ వీరేశం తెలిపారు. ఎంపీఓ అడేపు ప్రభాకర్, సూపర్డెంట్ కమలాకర్, సీనియర్ అసిస్టెంట్ షాజహాన్, పంచాయితి కార్యదర్శులు, ఆపరేటర్లు ఉన్నారు.
