జై భారత్ వాయిస్ వరంగల్
గ్రేటర్ వరంగల్ నగరంలోని రంగశాయిపేట 42వ డివిజన్ కాపువాడలో బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కర్ర కుమార్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్బంగా విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడ లాడించిన దీరుడు స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు ఆయన త్యాగాలను ప్రతి ఒక్కరు గుర్తుంచుకొవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కొంతం మోహన్ మహిళ అధ్యక్షులు అవునూరి లక్ష్మి, శెంకేషి రాధిక, మండల సురేష్, శెంకేషి సాంబయ్య,అడుప కవిత , కవిత, అంబటి రమ. చిట్ల రమ్య, దేవులపల్లి, వెంకటేష్, గండ్రతి మల్లి కార్జున్, పూల శివ, వనం శ్రవణ్, శేర్ల జనార్దన్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు
