Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

42వ డివిజన్ లో ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు.

జై భారత్ వాయిస్ వరంగల్
గ్రేటర్ వరంగల్ నగరంలోని రంగశాయిపేట 42వ డివిజన్ కాపువాడలో బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కర్ర కుమార్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్బంగా విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడ లాడించిన దీరుడు స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు ఆయన త్యాగాలను ప్రతి ఒక్కరు గుర్తుంచుకొవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కొంతం మోహన్ మహిళ అధ్యక్షులు అవునూరి లక్ష్మి, శెంకేషి రాధిక, మండల సురేష్, శెంకేషి సాంబయ్య,అడుప కవిత , కవిత, అంబటి రమ. చిట్ల రమ్య, దేవులపల్లి, వెంకటేష్, గండ్రతి మల్లి కార్జున్, పూల శివ, వనం శ్రవణ్, శేర్ల జనార్దన్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు

Related posts

ప్రజా శ్రేయస్సు ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడ సేవ

పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన టీఎన్జీఓస్ నాయకులు

Jaibharath News