దామెర: జై భారత్ వాయిస్
ఫిబ్రవరి 3న హైదరాబాద్లో నిర్వహించనున్న ఓబీసీ సాధన సభను విజయవంతం చేయాలని అరె సంక్షేమ సంఘం జిల్లా నాయకుడు వుస్నగిరి శ్రీకాంత్ కోరారు. సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరె కులానికి ఓబీసీ సర్టిఫికెట్ లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓబీసీ సర్టిఫికెట్ లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉద్యోగాలలో అవకాశాలు రాకుండా పోతున్నాయన్నారు. ఓబిసి సాధన కోసం హైదరాబాద్ లోని నాచారం రాఘవేంద్ర నగర్లోని ఏఎన్ఆర్ గార్డెన్లో నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమానికి జిల్లా నుండి పెద్ద మొత్తంలో ఆరె కులస్తులు తరలివెళ్లాలని తెలిపారు.

previous post