జై భారత్ వాయిస్ : భాగ్యనగరం
హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీఓస్ కేంద్ర సంఘ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జరిగిన ఎన్నికలలో టీఎన్జీఓస్ కేంద్ర సంఘ రాష్ట్ర అధ్యక్షులుగా మారం జగదీశ్వర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మారం జగదీశ్వర్ మాట్లాడుతూ ఉద్యోగుల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఉద్యోగుల హక్కుల కోసం పాటుపడతానని అదేవిధంగా ఉద్యోగులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు.
ఈ సందర్భంగా టీఎన్జీఓస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గాజె వేణుగోపాల్, కోశాధికారి పాలకుర్తి సదానందం, రాష్ట్ర కార్యదర్శి వేముల వెంకటేశ్వర్లు, జిల్లా బాధ్యులు చిరంజీవి తదితర ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

previous post