Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మంత్రి కొండా సురేఖకు జాతర ఆహ్వాన పత్రిక అందచేత

జై భారత్ వాయిస్ గీసుకొండ
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం కొమ్మాలగుట్టలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఈ నెల 17 నుంచి 31 వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు రావాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకి శనివారం నాడు రాత్రి 8 గంటలకు ఆహ్వానం పత్రాన్ని దేవాలయ అర్చకులు రామాచార్యులు అందజేశారు. ఈ మేరకు ఆలయ ఈఓ జి.శేషగిరి, అర్చకులు రామాచార్యులు, విష్ణు ఆచార్యులు సచివాలయంలో మంత్రి ని కలిసి ఆహ్వానించారు. వేదమంత్రాల నడుమ మంత్రికి స్వామి వారి శేష వస్త్రాలు సమర్పించి, ఆశీర్వచనమిచ్చారు.

Related posts

గాంధీ జయంతి వేడుకలు

కలెక్టర్ చేతుల మీదుగా వరంగల్ టీఎన్జీఓస్ డైరీ ఆవిష్కరణ

స్నేహితుడి కుటుంబానికి చేయూత