Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

బీఆర్ఎస్ పార్టీ నుంచి బిజెపి లో చేరికలు

జై భారత్ వాయిస్ వరంగల్
వరంగల్ తూర్పు నియోజకవర్గం 42వ డివిజన్ బిజెపి అధ్యక్షులు తాళ్లపల్లి అర్జున్  ఆధ్వర్యంలో లెనిన్ నగర్ ప్రాంతానికి చెందిన సుమారు 100మంది బిఆర్ఎస్ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలుఎర్రబెల్లి ప్రదీప్ రావు  క్యాంప్ కార్యాలయంలో బిజెపి పార్టీలో చేరారు. వారికి బిజెపి రాష్ట్ర నాయకులు వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో ప్రదీప్ రావు  మాట్లాడుతూ ప్రపంచంలోనే విశ్వ గురువుగా పేరుపొందినటువంటి మోడీ ఆధ్వర్యంలో పనిచేయడం మనకు దొరికిన అదృష్టం. రాబోయే లోక్ సభ ఎన్నికలలో మన వరంగల్ పార్లమెంట్ నుంచి అత్యధిక మెజారిటీ రావాలని కోరారు.పార్టీలో చేరిన వారిలో  తంగేలపల్లి శివ, రవితేజ, యాకయ్య, సన్నీ, సాయి తేజ, సంతోష్, సమ్మయ్య, యశ్వంత్, విజయలక్ష్మి, కోమల, మంజుల, ఉపేంద్ర, శ్రీలక్ష్మి చేరారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బక్కి రంజిత్, చాపల నాగరాజు, టింకు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

భద్రకాళి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలలో  పాత్రులమౌవుతాం: ఎంపీ రవిచంద్ర

మందపల్లి పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఏర్పాటు

Jaibharath News

నిరుపేద  కుటుంబానికి ఆర్థిక సహాయం