Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

తెలుగుదేశం పార్టీకి ఓటు భవిష్యత్తుకు బాట..

జై భారత వాయిస్, కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మంగళకుంట గ్రామంలో కళ్యాణదుర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు భార్య రమాదేవి, కోడలు ఇషిత, సోదరి రాధా మాధవి, కుటుంబ సభ్యులు పర్యటించి ప్రతిఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడం వలన మన బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని తెలిపారు. వచ్చి అభివృద్దే అజెండాగా పనిచేస్తామని భరోసా ఇచ్చారు. అందుకు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,మండల నాయకులు, కార్యకర్తలుగ్రామస్థులు పాల్గొన్నారు.

Related posts

ఎమ్మార్వో రమణయ్యను హత్య చేసిన వ్యక్తిని గుర్తించాం : విశాఖ సీపీ

Jaibharath News

కరీగానిపల్లిలో పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన ఉపాధ్యాయులు

Jaibharath News

కరెంట్ షాక్ తో మృతి చెందిన కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం

Gangadhar