Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు లో చలివేంద్రం ప్రారంభం

ఆత్మకూరులో చలివేంద్రం ప్రారంభం
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
ఆత్మకూరు మేజర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని జాతీయ రహదారి ప్రక్కన శనివారం చలివేంద్రాన్ని ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆత్మకూర్ గ్రామ ప్రత్యేక అధికారి ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎండలు మండుతున్న తరుణంలో ప్రయాణికుల దాహార్తి తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేశామన్నారు. చలివేంద్రాల ఏర్పాటునుసామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు ప్రజలు తీవ్ర ఎండల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని. ఆయన పిలుపునిచ్చారు గ్రామాల్లో చలివేంద్రాలు ఏర్పాటుకు దాతలు కృషి చేయాలి అన్నారు కార్యక్రమంలో ఎంపీఓ చేతన్ కుమార్ రెడ్డి మండల ప్రత్యేక అధికారి రాజేందర్ కేజీబీవీ ప్రత్యేక అధికారి వాసవి పి ఆర్ ఏ ఈ లతా గ్రామ కార్యదర్శి మేడ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Related posts

బాల్యం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి

Jaibharath News

సామాజిక సేవలో వాసవి క్లబ్

Sunder

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

Sambasivarao