జై భారత్ వాయిస్ హన్మకొండ
హన్మకొండలోని సుబేదారిలోని కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజి, రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ జరిగింది. 70 మంది విద్యార్థులు హైదరాబాద్ ఆధారిత యం. ఎస్. యన్ లేబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్లేస్మెంట్ పొందారని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తెలిపారు. ఈ ఎంపికకు ముందు ప్రీ-ప్లేస్మెంట్ టాక్, రాత పరీక్ష ,గ్రూప్ డిస్కషన్ రౌండ్లు జరిగాయి. మొత్తం 70 మంది విద్యార్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యారు, వీరిలో 8మంది బీఎస్సీ (రసాయన శాస్త్రం విద్యార్థులు, 4 మంది ఎమ్మెస్సీ (అనలిటికల్) విద్యార్థులు మరియు 10మంది ఎమ్మెస్సీ (ఆర్గానిక్) విద్యార్థులు ఉద్యోగాలకు అధికారికంగా ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు వివిధ విభాగాల్లో ఇంటర్న్ షిప్ అందించనున్నట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు. వారికి ఇంటర్న్షిప్ సమయంలో రూ.2. ఓ ఎల్ పి ఏ జీతం , అది పూర్తయిన తర్వాత సంవత్సరానికి రూ. 2.1 లక్షల జీతం నుండి 2.5 లక్షల జీతం వరకు ఇవ్వబడుతుంది. కళాశాల ప్రిన్సిపాల్ యస్ జ్యోతి పేర్కొన్నారు. యూనివర్శిటీ విద్యార్థులు ప్లేస్మెంట్ సెల్ సేవలు వినియోగించుకోవాలని కోరారు. ప్లేస్మెంట్ సెల్ డేరెక్టర్ కిరణ్ కుమార్ బొల్లం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తాము ఎంచుకున్న రంగంలో అనుభవాన్ని పొందేందుకు , వారి భవిష్యత్ వృత్తికి కీలక నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఇంటర్న్షిప్ ఒక విలువైన అవకాశం, ఇది అకడమిక్ లెర్నింగ్ , రియల్ వరల్డ్ అప్లికేషన్ మధ్య అంతరాన్ని తగ్గించడానికి దోహదపడుతుందని తెలిపారు. ఎంపికైన విద్యార్థులను యూనివర్శిటీ ప్లేస్మెంట్ డైరెక్టర్లు కిరణ్ కుమార్ బొల్లం, రమణబాబు, రెహమాన్, శ్రీదేవి ,అధ్యాపకులు వారిని అభినందించారు.