Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఎన్టీఆర్కృష్ణా

నూకాలమ్మ అమ్మవారి సేవలో మైలవరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్

ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి, కొండపల్లి మున్సిపాలిటీలోని వేంచేసియున్న శ్రీ నూకాలమ్మ తల్లి, అమ్మవారి సేవలో మైలవరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి, శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు తరించారు.కొండపల్లి బి కాలనీలోని శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి జాతరను పురస్కరించుకొని సోమవారం ఆలయానికి విచ్చేసిన వసంత కృష్ణప్రసాదు , మైలవరం నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ్మోహనరావు (గాంధీ)అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా వారికి నూకాలమ్మ ఆలయం కమిటీ సభ్యులు, భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులతో పాటు పార్టీలకతీతంగా నాయకులు పాల్గొన్నారు.

Related posts

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ను ఎగురవేయండి*

వైద్య కళాశాలల్లో  29మంది   అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

అదివాసులకు అండగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం సిఎం చంద్రబాబు.