Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లాహన్మకొండ జిల్లా

ద్విచక్ర వాహనాల చోరికి పాల్పడుతున్న మైనర్ దొంగ అరెస్ట్

ద్విచక్ర వాహనాలను చోరీలకు పాల్పడుతున్న మైనర్ దొంగను సిసిఎస్ మట్టేవాడ పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్ట్ చేసారు. దొంగ నుండి పోలీసులు మూడు లక్షల రూపాయల విలువ గల నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాదీనం చేసుకున్నారు.ఈ అరెస్ట్ కు సంబందించి వరంగల్ ఏసీపీ నాందిరామ్ నాయక్ వివరాలు వెల్లడిస్తూ హనుమకొండ నగరానికి చెందిన మైనర్ బాలుడు చెడు వ్యసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించుకునే లక్ష్యంతో ద్విచక్ర వాహన చోరీలకు సిద్ధపడ్డాడు. తాళం వేసి పార్కింగ్ లో ఉన్న నాలుగు ద్విచక్ర వాహనాలను చోరీ చేసాడు. ఇందులో మట్టేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు చోరీలు, మామునూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక చోరీకి పాల్పడ్డాడు. ఈ ఈ వాహన చోరీల పేపర్ మతమైన పోలీసులు తమకు అందుబాటులో ఉన్న పరిజ్ఞానాన్ని వినియోగించుకొని నిందితుడిని గుర్తించారు. ఈరోజు ఉదయం సిసిఎస్ మరియు మట్టెవాడ పోలీసులు పోతన జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానస్పదంగా ద్విచక్ర వాహనంపై వస్తున్న నిండితుడుని పోలీసులు తనిఖీ చేసి విచారించగా ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడినట్లుగా అంగీకరించడంతో పోలీసులు నిందితుడి ఇంటి మరో మూడు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. మైనర్ దొంగను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిసిస్, మాట్టేవాడ ఇన్స్ స్పెక్టర్లు అబ్బయ్య, గోపి, సిసిఎస్ ఎస్. ఐ సంపత్, ఐ. డి అసిస్టెంట్ సల్మాన్ పాషా, సిసి ఎస్ హెడ్ కానిస్టేబుళ్ళు మున్నా, వేణుగోపాల్,రవి, కానిస్టేబుళ్లు రాములు, చంద్రశేఖర్ లను ఏసీపీ నందిరామ్ నాయక్ అభినందించారు.

Related posts

జాతర సేవకు ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు!

Jaibharath News

బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించిన రైతులను ప్రజలను పక్కదారి పట్టించి రాజకీయం చేస్తున్నరు

అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో బిజెపి నేతలు

Jaibharath News