నీరుకుల్ల గ్రామంలో సంచరిస్తున్న పునుగు పిల్లులు
-పంచనేని రాజేశ్వరరావు ఇంట్లోకి వచ్చిన పునుగు పిల్లులు-
-వరంగల్ ఫారెస్ట్ అధికారులు జూ పార్కు కు తరలింపు
( జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
అరుదైన పూనుగు పిల్లులు ఆత్మకూరు మండలం నీరుకుల్ల గ్రామంలో సంచరిస్తున్నాయి. పంచనేని రాజేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం ఆత్మకూరు మండలం నీరుకుల్ల గ్రామంలో తన ఇంటికి ఉదయము పునుగు పిల్లి కుక్కలను చూసి ఇంట్లోకి వచ్చిందన్నారు. వెంటనే వరంగల్ ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఫారెస్ట్ పోలీసులు వచ్చి చూసి ఇది పునుగు పిల్లి అని నిర్ధారించుకున్నారనీ తెలిపారు. వరంగల్ జూ పార్కు సిబ్బందితో తిరిగి వచ్చి బోనులో బంధించి వరంగల్ జూ పార్కు తరలించారు. మరొకటి చెట్ల పొదల్లోకి పారిపోగా కుక్కలు వెంబడించడంతో పారిపోయినట్లు తెలిపారు. . అరుదైన పునుగు పిల్లి సంచరించడంతో దాని చూసేందుకు గ్రామస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వెంకటేశ్వర స్వామి కి ఎంతో ఇష్టమైన పూనుగుపిల్లి తన ఇంట్లోకి రావడం ఎంతో అదృష్టంగా పంచినేని రాజేశ్వరరావు భావిస్తున్నారు. ఇప్పటినుండి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి ఒక్కపొద్దు ఉండి ఏడుకొండల ఎక్కి స్వామివారిని దర్శించుకుంటానని ఆయన తెలిపారు
