జై భారత వాయిస్ కుందుర్పి
అనంతపురం జిల్లా కంబదూరు మండలం నూతిమడుగు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కళ్యాణదుర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు రోడ్ షో నిర్వహించారు. ఎన్నికల ప్రచారనికి టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు, గ్రామస్థులు పూలవర్షం కురిపించి ఘజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా అమిలినేని మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇక్కడ బీసీ హాస్టల్ నిర్మించామని, గురుకుల పాఠశాల భవనానికి నిధులు మంజూరు చేసి కొంత వరకు నిర్మాణం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దాన్ని పూర్తిగా విస్మరించి నిర్మాణాలు కాస్త శితిలావస్థకు చేరకున్నాయని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భవనాలు ఎందుకులెండి ఆపేసారో తెలుసుకుని తిరిగి నిర్మించి అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో యాదవ, కమ్యూనిటీ భవనం, వాల్మీకి కమ్యూనిటీ భవనాలు మండల కేంద్రాల్లో ఇవ్వడం జరుగుతుందని ఈ గ్రామానికి కావాలని అడుగుతున్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిశీలిస్తామనితెలిపారు..గ్రామంలో మౌళిక వసతులు కూడా ఏమి ఉన్నా తప్పకుండా ప్రభుత్వం ఏర్పడిన తరువాత వాటిని పరిష్కరించి ఇబ్బందులు లేకుండా చూస్తామాన్నారు..రాష్ట్ర భవిష్యత్ చంద్రబాబు నాయుడి చేతుల్లో ఉందని అందుకు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలాని అభ్యర్థించారు…కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు, కంబదూరు మండల సీనియర్ తెలుగుదేశం పార్టీ, నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.

previous post