Jaibharathvoice.com | Telugu News App In Telangana
జాతీయ వార్తలు

బీజేపీ కి ఎన్నికల కమీషన్ నోటీసు

దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని విపక్షాలు చేసిన ఫిర్యాదును భారత ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుంది. రాజస్థాన్‌‌లోని జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై ఈసీ స్పందించింది. ప్రధాని మోదీ ప్రసంగంపై ఏప్రిల్ 29లోగా సమాధానం చెప్పాలని బీజేపీని ఆదేశించింది. ప్రధాని మోదీతో పాటు కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈసీ చర్యలకు దిగింది. ఏప్రిల్ 29లోపు వీరందరూ సమాధానం చెప్పాలని సూచించింది.

Related posts

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో అమెరికా న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి. మర్ఫీ ఢిల్లీలో సమావేశం

ఓ విద్యార్థి పదవ తరగతి పాస్ గ్రామంలో సంబరాలు ఎందుకంటే

ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం