Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

మే 2న రెడ్డి కృతజ్ఞత సభను విజయ వంతం చేయాలి

జై భారత్ వాయిస్:దామెర
రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల మే 2న నిర్వహించనున్న రెడ్డి కృతజ్ఞత సభను విజయ వంతం చేయాలని రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి కోరారు. గురువారం హనుమకొండ జిల్లా దామెర మండలం దుర్గంపేట శివారులోని ఎన్ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ లో  మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.  హనుమకొండ జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడు అర్జుల కిషన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్యఅతిథిగా రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపు జై పాల్ రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ మే 2న కృతజ్ఞత సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. హనుమకొండ జిల్లా కరీంనగర్ రోడ్  (భీమారం)లోని  KLN గార్డెన్స్ లో జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమాజంలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నిరుపేద రెడ్ల అభివృద్ధి, సంక్షేమం కోసం చట్టబద్దతతో కూడిన రెడ్డి కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో పేద రెడ్ల సంక్షేమం కోసం 5వేల కోట్ల రూపాయల నిధులతో రెడ్డి కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.  జిల్లా పరిధిలోని ఆయా గ్రామాల్లోని రెడ్లు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జిల్లా కమిటీ సీనియర్ నాయకులు వీసం రమణారెడ్డి, మన్నెం ఇంద్రారెడ్డి, దామెర మండల అధ్యక్షుడు కేతిపెల్లి శ్రీధర్ రెడ్డి, కాంతాల రవీందర్ రెడ్డి, కొట్ర విజేందర్ రెడ్డి, కునాటి సునీల్ రెడ్డి, ఓరుగంటి కరుణాకర్ రెడ్డి, వీసం శ్రీనివాస్ రెడ్డి, కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

అర్హులందరికీ గృహలక్ష్మి పథకం వర్తింపచేస్తాం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.

కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Jaibharath News

హనుమాన్ దేవాలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం

Jaibharath News