జై భారత్ వాయిస్ గీసుకొండ
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని గీసుగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మండల పరిధిలోని అన్ని ఉప కేంద్రాల పరిధిలో మలేరియా పై అవగాహన ర్యాలీలను నిర్వహించారు.అనంథరం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ అర్చన మాట్లాడుతూ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దోమలు కుట్టకుండా దోమతెరలను వాడాలని సూచించారు ఎవరికైనా జ్వరం వస్తే తక్షణమే సంబంధిత వైద్య సిబ్బందిని సంప్రదించి చికిత్స చేయించుకోవాలని ఆమె అన్నారు.ఈ ర్యాలీలలో వైద్యాధికారి డాక్టర్ అర్చన తోపాటు, సి హెచ్ ఓ మధుసూదన్ రెడ్డి, సూపర్వైజర్స్ కిరణ్ కుమార్, స్వరూప, అన్ని ఉపకేంద్రాల డాక్టర్లు, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్స్, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


