జై భారత్ వాయిస్ భాగ్యనగరం
బీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభంకావడంతొ కాంగ్రెస్, బీజేపీ నేతల గుండెల్లో దడ పుట్టిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ బస్సు యాత్రకు వస్తున్న ప్రజా స్పందనను చూసి ఆ రెండు పార్టీలు ఓర్వలేకపోతున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. గురువారం నాడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ లో కేటిఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన పరుష పదజాలం మీద ఎన్నికల సంఘానికి 8 ఫిర్యాదులు ఇచ్చాం. కానీ చర్యల్లేవు. కేసీఆర్ను ఉరితీస్తాం.. లాగుల తొండలు వదులుతాం.. ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు.. కేసీఆర్ తల నరకండి.. కేసీఆర్ తల తెగ్గోయండి అని రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ మాటలు ఎన్నికల సంఘానికి నీతిసూక్తులు, సుభాషితాల్లాగా వినబడుతున్నట్లుంది. ఈ మాటలు ఈసీకి వినిపించవు. అదే కేసీఆర్ నేతన్నలు, రైతుల పక్షాన మాట్లాడితే గట్టిగా ఒక్క మాట మాట్లాడితే.. 48 గంటల నిషేధం విధించారు అని కేటీఆర్ తెలిపారు.
ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ పన్నాగం.బడా భాయ్.. చోటా భాయ్ కన్నుసన్నల్లో కేంద్ర ఎన్నికల సంఘం పని చేయకపోతే.. తామిచ్చిన 27 ఫిర్యాదులపై స్పందించాలి. రేవంత్ మీద 8, మరో 19 ఫిర్యాదులు మిగతా పార్టీ నాయకులు, వారి వైఖరి మీద ఈసీకి ఫిర్యాదు చేశాం. ఒక్కటంటే ఒక్కదాని మీద కూడా చర్య లేదు. కొండా సురేఖకు మందలింపు తప్ప ఒక్కటంటే ఒక్క చర్య లేదు. వారి ప్రచారాన్ని నిషేధించలేదు. కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించగానే కాంగ్రెస్కు, బీజేపీకి దడ పుట్టింది. స్టేట్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్, కేంద్రంలో ఐబీ రిపోర్టు ఎప్పటికప్పుడు ఇస్తున్నాయి. కేసీఆర్ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మంచి స్పందన వస్తుందని ఆ పార్టీలకు కంటగింపుగా మారింది. 2014లో బడా భాయ్ చేసిన మోసం, 2023లో చోటా భాయ్ చేసిన మోసాన్ని పూసగుచ్చినట్టు ప్రజలకు వివరిస్తుంటే.. తట్టుకోలేక ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇది ఒక పన్నాగం అనేది పార్టీ స్థిరమైన అభిప్రాయం అని కేటీఆర్ పేర్కొన్నారు.

previous post
next post